అప్పుల ఊబిలో రాష్ట్రం: వలవల బాబ్జీ

ABN , First Publish Date - 2023-02-01T23:27:20+05:30 IST

వైసీపీ పాలనలో రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి వలవల బాబ్జి అన్నారు.

అప్పుల ఊబిలో రాష్ట్రం: వలవల బాబ్జీ
తాడేపల్లిగూడెంలో వలవల బాబ్జీ ఇదే ఖర్మ రాష్ర్టానికి కార్యక్రమం నిర్వహిస్తున్న దృశ్యం

తాడేపల్లిగూడెం అర్బన్‌, ఫిబ్రవరి 1: వైసీపీ పాలనలో రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి వలవల బాబ్జి అన్నారు. బుధవారం 9వ వార్డు శేషమహల్‌ రోడ్డులో పట్టణ అధ్యక్షుడు పట్నాల రాంపండు అధ్యక్షతన ఇదేం ఖర్మ–మన రాష్ట్రానికి నిర్వహించి మాట్లాడుతూ విపరీతంగా పెరిగిన నిత్యావసరాల ధరలతో ప్రజలు గగ్గోలు పెడుతున్నారన్నారు. ముత్యాల శ్రీనివాసరావు, వాడపల్లి సుబ్బరాజు, చెప్పుల వాసు, పసలపూడి రాంబాబు, షేక్‌ షరీఫ్‌, కిలాడి సాయి పాల్గొన్నారు.

నియంత పాలనకు చరమగీతం పాడాలి: ఆరిమిల్లి

ఇరగవరం, ఫిబ్రవరి 1: వైసీపీ అధికారంలోకి వచ్చాక ప్రజల ఆదాయం తగ్గి, ఖర్చులు పెరిగి, పనులు లేక తీవ్ర ఇక్కట్లకు గురవుతు న్నారని తణుకు మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. కె.కుముదవల్లి గ్రామంలో బుధవారం ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో రోడ్లు అధ్వానంగా ఉన్నాయని, పారిశుధ్యాన్ని గాలి కొదిలేశార న్నారు. పార్టీ మండల అధ్యక్షుడు గోపిశెట్టి రామకృష్ణ, బసవా శంకరరావు, బసవా నాగేశ్వరరావు, మాజీ ఎంపీటీసీ యార్లగడ్డ పాపాయమ్మ, నరసాపురం పార్లమెంట్‌ ఎస్సీ సెల్‌ అధ్యక్షులు చుక్కా సాయిబాబు, మండల సెల్‌ అధ్యక్షుడు చోడే సంజీవరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-02-01T23:27:24+05:30 IST