కల్యాణం.. కమనీయం

ABN , First Publish Date - 2023-03-31T00:17:56+05:30 IST

అందాల రామయ్య పెళ్ళి కొడుకుగా, సుకుమారి సీతమ్మ పెళ్ళి కూతురుగా ముస్తాబయ్యారు.

కల్యాణం.. కమనీయం
ప్రత్యేక అలంకరణలో కె.పెంటపాడు భైరాగిమఠంలోని సీతారాములు

వైభవం.. సీతారాముల కల్యాణం

పెంటపాడు, మార్చి 30 : అందాల రామయ్య పెళ్ళి కొడుకుగా, సుకుమారి సీతమ్మ పెళ్ళి కూతురుగా ముస్తాబయ్యారు. పండితుల వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ సీతారాముల కల్యాణం కనుల పండువగా జరి గింది. శ్రీరామ నవమి సందర్భంగా గురువారం జిల్లావ్యాప్తంగా జరిగిన కల్యా ణ వేడుకను చూసి భక్తులు భక్త పారవశ్యంలో మునిగిపోయారు. జై శ్రీరామ్‌ అంటూ నినదించారు. కె.పెంటపాడు భైరాగిమఠం గోపాలస్వామి, ఆంజనేయ స్వామి ఆలయంలో వేలాది మంది భక్తులు కల్యాణాన్ని వీక్షించారు. దేవ దాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే ఈలి నాని స్వామి వారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. సుము హూర్త సమయాన వేద మంత్రోచ్ఛరణ నడుమ ఆలయ ప్రధానార్చకుడు త్రిలోచనదాస్‌ బ్రహ్మత్వంలో సీతమ్మ మెడలో మాంగల్యధారణ చేయించారు. తలంబ్రాల కోసం భక్తులు పోటీపడ్డారు. వేలాది మందికి అన్న ప్రసాదాన్ని వితరణ చేశారు. ఆలయ ఫిట్‌పర్సన్‌ చీమలకొండ సాయి, ఆలేటి గోపి, పద్మ, సూపరింటెండెంట్‌ నాగబాబు తదితరులు హాజరయ్యారు.

Updated Date - 2023-03-31T00:17:56+05:30 IST