ఆకట్టుకున్న సైకత శిల్పం
ABN , First Publish Date - 2023-06-06T00:27:34+05:30 IST
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పేరుపాలెం బీచ్ వద్ద ఏపీ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సైకత శిల్పం ఆకట్టుకుంది.
మొగల్తూరు, జూన్ 5:ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పేరుపాలెం బీచ్ వద్ద ఏపీ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సైకత శిల్పం ఆకట్టుకుంది. విజయవాడకు చెందిన బాలాజీ పర్యావరణంపై రూపొందించిన సందేశాత్మక సైకత శిల్పాన్ని జిల్లా కలెక్టర్ ప్రశాంతి, ఇతర అధికారులు ప్రశంసించారు. స్వయంగా జిల్లా కలెక్టర్ ప్రశాంతి, ఎస్పీ రవిష్రకాష్ ఇతర శాఖల అధికారులు పాఠశాల విద్యార్ధులు స్థ్ధానికులు సుమారు 4 కిలో మీటర్ల మేర ప్లాస్టిక్ వస్తువులను క్లీన్ చేశారు.