210 క్విటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
ABN , First Publish Date - 2023-01-08T23:59:16+05:30 IST
అక్రమంగా తరలి స్తున్న 210 క్వింటాళ్లు రేషన్ బియ్యాన్ని రెవెన్యూ, విజిలెన్స్ అధికారులు మండలం లోని కాళీపట్నం తూర్పు గ్రామంలో ఆదివారం ఉదయం పట్టుకున్నారు.
మొగల్తూరు, జనవరి 8 : అక్రమంగా తరలి స్తున్న 210 క్వింటాళ్లు రేషన్ బియ్యాన్ని రెవెన్యూ, విజిలెన్స్ అధికారులు మండలం లోని కాళీపట్నం తూర్పు గ్రామంలో ఆదివారం ఉదయం పట్టుకున్నారు. విజిలెన్స్ ఇన్స్పెక్టర్ పి.శివరామకృష్ణ తెలిపిన వివరాలివి.. గుంటూరు జిల్లా చెరుకుపల్లి నుంచి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మండపేటకు అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్న ట్టుగా విజిలెన్స్ ఎస్పీ కరణకుమార్కు వచ్చిన సమాచారం మేరకు మొగల్తూరు మండలం కాళీపట్నం తూర్పులో వాహనాలు తనిఖీ చేపట్టా మన్నారు. బియ్యం లోడు లారీని ఆపి తనిఖీ చేయగా రూ.3.78 లక్షలు విలువైన 210 క్వింటాళ్లు రేషన్ బియ్యాన్ని పట్టుకుని లారీని సీజ్ చేసి డ్రైవర్ అద్దేపల్లి ఏసురత్నం, బియ్యం వ్యాపారి కంకటాల సతీష్, లారీ యజమాని కె.వెంకట మల్లికార్జునరావులపై కేసు నమోదు చేశామన్నారు. ఈ తనిఖీల్లో డిప్యూటీ తహసీల్దార్ జి.నరేష్కుమార్ తదితరులున్నారు.