మరుగుదొడ్డి గుంతలో పడి బాలుడి మృతి

ABN , First Publish Date - 2023-03-26T00:59:55+05:30 IST

మరుగుదొడ్డి కోసం తవ్విన నూతిలో పడి రెండేళ్ళ బాలుడు మృతి చెందాడు.

మరుగుదొడ్డి గుంతలో పడి బాలుడి మృతి

పెదవేగి, మార్చి 25 : మరుగుదొడ్డి కోసం తవ్విన నూతిలో పడి రెండేళ్ళ బాలుడు మృతి చెందాడు. పెదవేగి మండలం న్యాయంపల్లికి చెందిన దేవరపల్లి రవి, వెంకటేశ్వ రమ్మలకు పది నెలలు, రెండేళ్ల వయసున్న ఇద్దరు మగ పిల్లలు ఉన్నారు. శనివారం ఉదయం రెండేళ్ల బాలుడు గగన్‌తేజ వారి ఇంటికి సమీపంలో ఉండే తాతయ్య, నానమ్మల ఇంటికి వెళ్ళాడు. నానమ్మ సీఎం సభకు వెళ్ళగా, తాతయ్య ఇంటి దగ్గర ఉన్నాడు. కొత్తగా నిర్మించుకున్న రేకుల షెడ్డు దగ్గర ఇటీవల మరుగుదొడ్డి నిర్మాణం చేపట్టారు. దీనికోసం నుయ్యి తవ్వి దానిపై సిమెంట్‌ రేకు ఉంచారు. కొద్దిసేపటికి బాలుడు కనిపించకపోయేసరికి బాలుడి తాతయ్య కుమారుని ఇంటికి వెళ్ళి కోడలుకు విషయం చెప్పి చుట్టుపక్కల వెతికారు. నుయ్యిపై ఉన్న రేకు కొంత పక్కకు జరిగి ఉండ డంతో అనుమానం వచ్చి నూతిలో చూడగా నీటిలో విగతజీవుడై గగన్‌తేజ కనిపించాడు. స్థానికంగా వైద్యుని దగ్గరకు తీసుకెళ్ళగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యుడు తెలిపారు. బాలుని మృతితో ఆ కుటుంబం బోరున విలపిస్తోంది. వచ్చేనెల 18న రెండో పుట్టినరోజు కోసం ఎదురు చూస్తున్నామని ఇంతలోనే ఇంత విషాదం జరిగిందని తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు.

Updated Date - 2023-03-26T00:59:55+05:30 IST