విద్యుత్ ప్రమాదాల నివారణపై అవగాహన కల్పించాలి
ABN , First Publish Date - 2023-06-26T23:46:22+05:30 IST
విద్యుత్ వినియోగంలో భద్రతా ప్రమాణాలు పాటించడం ద్వారా ప్రజలు విద్యుత్ ప్రమాదాల బారిన పడకుండా రక్షించుకోవచ్చునని జాయింట్ కలెక్టర్ లావణ్యవేణి అన్నారు.
అధికారులతో జాయింట్ కలెక్టర్ సమీక్ష
ఏలూరు కలెక్టరేట్, జూన్ 26: విద్యుత్ వినియోగంలో భద్రతా ప్రమాణాలు పాటించడం ద్వారా ప్రజలు విద్యుత్ ప్రమాదాల బారిన పడకుండా రక్షించుకోవచ్చునని జాయింట్ కలెక్టర్ లావణ్యవేణి అన్నారు. వివిధ శాఖల అధికారులను ఉద్దేశించి ఆమె మాట్లాడారు. కేంద్ర విద్యుత్ అధారిటీ స్టాండింగ్ కమిటీ సూచనల మేరకు ప్రతి ఏడాది జూన్ 26 నుంచి జులై 2 వరకూ జాతీయ విద్యుత్ భద్రతా వారోత్సవాలు పాటిస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరు విద్యుత్ భద్రత పాటించాలన్నారు. భద్రత అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. విద్యుత్ ఫిర్యాదులుంటే 1912 టోల్ ఫ్రీ నెంబర్కు ఫోన్ చేయాలని సూచించారు. ఎపీఇపీడీసీఎల్ ఎస్ఇ సాల్మాన్రాజు, తదితరులు పాల్గొన్నారు.