రైతులకు ఇబ్బంది రానీయం : జేసీ
ABN , First Publish Date - 2023-04-18T00:24:35+05:30 IST
ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటామని జేసీ బి.లావణ్య వేణి తెలిపారు.
ఉంగుటూరు/నిడమర్రు ఏప్రిల్ 17: ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటామని జేసీ బి.లావణ్య వేణి తెలిపారు. నారాయణపురం, చేబ్రోలు రైతు భరోసా కేంద్రాలను సోమవారం పరిశీలించి రైతులకు గోనె సంచుల సరఫరా విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. తేమ శాతం యంత్రాలను పరిశీలించారు. జిల్లాలోని 247 రైతు భరో సా కేంద్రాలను క్లస్టర్లుగా గుర్తిస్తూ 136 రైతు భరోసా కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు చేస్తారన్నారు. రైతులకు ఏ ఇబ్బంది కలిగినా 1800–425–6453 టోల్ ఫ్రీ నెంబరుకు ఫోన్ చేయాలన్నారు.
‘ధాన్యం కొనుగోలు కేంద్రాలు సిద్ధం
నిడమర్రు మండలంలో ఈ–క్రాప్ నమోదు ప్రకారం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఆయా రైతు భరోసా కేంద్రా ల ద్వారా ధాన్యం కొనుగోలుకు సిద్ధం గా ఉన్నాయని జడ్పీ సీఈవో, మండల ప్రత్యేకాధికారి రవికుమార్ అన్నారు. సోమవారం మండల పరిషత్ కార్యాలయంలో మండల స్థాయి అధికారు లు, సచివాలయ సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. సమావేశంలో గ్రామాల వారీగా రబీ సీజన్ ధాన్యం కొనుగోలు లక్ష్యాలను నిర్దేశించారు. ఎంపీడీవో పీవీ ప్రకాశ్, తహసీల్దార్ సాయిరాజ్, ఏవో బెన్సీ థామస్, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.