వైసీపీ పాలనలో మహిళలపై దాడులు

ABN , First Publish Date - 2023-03-31T00:05:09+05:30 IST

వైసీపీ పాలనలో మహిళలపై దాడులు ఎక్కువయ్యాయని జనసేన నేత కొఠారు ఆదిశేషు అన్నారు.

వైసీపీ పాలనలో మహిళలపై దాడులు
సమావేశంలో మాట్లాడుతున్న ఆదిశేషు

దెందులూరు, మార్చి 30 : వైసీపీ పాలనలో మహిళలపై దాడులు ఎక్కువయ్యాయని జనసేన నేత కొఠారు ఆదిశేషు అన్నారు. ఏలూరులోని దెందులూరు నియోజకవర్గ కార్యాలయంలో గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దెందులూరుకు డీగ్రీ కాలేజీ, పాలముపర్రు–కొత్తముప్పర్రు బ్రిడ్జి, కొవ్వలి, కన్నాపురం, గుడివాకలంకలో విద్యుత్‌ సబ్‌స్టేషన్‌, పెదవేగి, జూనియార్‌ కాలేజీ కావాలని స్థానిక ఎమ్మెల్యే దెందులూరు వచ్చిన ముఖ్యమంత్రికి విన్నవించినా సీఎం నుంచి కనీస స్పందన లేదన్నారు. వైసీపీ ప్రభుత్వం మహిళ పక్షపాతం అని చెప్పె ఎమ్మెల్యే విజయరాయి లో జనసేన వీరమహిళ చిన్నమ్మ చేపల దుకాణం ఎందుకు దౌర్జన్యంగా తొలగిం చారని ప్రశ్నించారు. ఇసుక పాలసీలను నాలుగు సార్లు మార్చినా పేదలకు ఇసుక అందడం లేదన్నారు. వృత్తినైపుణ్యం కోర్సులు నిర్వహిస్తున్నామని చెబుతున్నారని, ఎక్కడ నిర్వహిస్తున్నారో చెప్పాలని ఎద్దేవా చేశారు. కొఠారు లక్ష్మి, ముత్యాల రాజేష్‌, కలపాల ప్రేమ్‌కుమార్‌, ఏనుగు రామకృష్ణ, బొడ్డు గిరిబాబు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-31T00:05:09+05:30 IST