Share News

ఆర్టీసీ డ్రైవర్‌కు జైలు, జరిమానా

ABN , Publish Date - Dec 23 , 2023 | 12:40 AM

ఆర్టీసీ బస్సును నిర్లక్ష్యంగా నడిపి విద్యార్థి మృతికి కారణమైన డ్రైవర్‌కు 3 నెలల జైలు, రూ.2 వేల జరిమానా విధిస్తూ నూజివీడు స్పెషల్‌ మేజిస్ర్టేట్‌ వేల్పుల కృష్ణమూర్తి శుక్రవారం తీర్పుచెప్పారు.

ఆర్టీసీ డ్రైవర్‌కు జైలు, జరిమానా

నూజివీడు టౌన్‌, డిసెంబరు 22: ఆర్టీసీ బస్సును నిర్లక్ష్యంగా నడిపి విద్యార్థి మృతికి కారణమైన డ్రైవర్‌కు 3 నెలల జైలు, రూ.2 వేల జరిమానా విధిస్తూ నూజివీడు స్పెషల్‌ మేజిస్ర్టేట్‌ వేల్పుల కృష్ణమూర్తి శుక్రవారం తీర్పుచెప్పారు. ప్రాసిక్యూషన్‌ కథనం ప్రకారం 2018, జూలై 4న ముసునూరు మండలం చింతలవల్లికి చెందిన బీటెక్‌ విద్యార్థి సాయిరామ్‌ బైక్‌పై వస్తుండగా వడ్లమాను గ్రామశివారు వద్ద ఆర్టీసీ బస్సు అతివేగంగా అతనిని ఢీ కొనడంతో విద్యార్థి ఘటనా స్థలంలోనే చనిపోయాడు. ఆగిరిపల్లి పోలీసులు గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన ఆర్టీసీ డ్రైవర్‌ బీమవరపు దశరథరామిరెడ్డిపై కేసు నమోదు చేసి కోర్టులో ఛార్జ్‌షీట్‌ దాఖలు చేశారు. విచారణ అనంతరం న్యాయాధికారి పై విధంగా తీర్పిచ్చారు. ప్రాసిక్యూషన్‌ తరఫున ఏపీపీ కె.కిషోర్‌బాబు వాదించారు.

Updated Date - Dec 23 , 2023 | 12:40 AM