తెలుగు సాహిత్యాభివృద్ధికి కవులు, రచయితలు కృషి చేయాలి
ABN , First Publish Date - 2023-06-26T00:07:19+05:30 IST
ఆధునిక సమాజంలో తెలుగు సాహిత్యాభివృద్ధికి కవులు, రచయితలు కృషి చేయాల్సిన అవసరం ఎంతైన ఉందని కృష్ణాజిల్లా రచయితల సంఘం కార్యదర్శి, ప్రముఖ ఆధ్యాత్మిక సాహితీవేత్త బమ్మిడిపాటి బాలత్రిపుర సుందరి కోరారు.
గణపవరం, జూన్ 25: ఆధునిక సమాజంలో తెలుగు సాహిత్యాభివృద్ధికి కవులు, రచయితలు కృషి చేయాల్సిన అవసరం ఎంతైన ఉందని కృష్ణాజిల్లా రచయితల సంఘం కార్యదర్శి, ప్రముఖ ఆధ్యాత్మిక సాహితీవేత్త బమ్మిడిపాటి బాలత్రిపుర సుందరి కోరారు. విష్ణుసాయి జ్ఞాన జ్యోతి సాహితి సంస్థ రజతోత్సవం స్థానిక కేవీపీ ఫంక్షన్హాలులో ఆదివారం నిర్వహించారు. బాలత్రిపురసుందరి మాట్లాడుతూ 25 ఏళ్లుగా సాహితీ సేవ చేస్తున్న విష్ణుసాయి జ్ఞానజ్యోతి సాహితి సంస్థను ఆమె అభినందించారు. రాసిన కవిత్వాన్ని పదేపదే చదివితే మనం రాసిన కవిత్త్వం ఎన్నిసార్లు చదువుతామో అన్ని విజయాలు సొంతం చేసుకోవచ్చని పేర్కొన్నారు. గురువు ఆచరించిన దానిని శిష్యులకు బోధించాలని సోదాహరణగా తెలిపారు. దేవరుణం, రుషిరుణం, పితృరుణం, ఎలా తీర్చుకోవాలో.. దివి అంటే భగవంతుడని విధి రాతను ఎవరు తప్పించుకోలేరని వివరించారు. మహిళలు అత్యుత్తమమని వారు సమాన హక్కుల కోసం పోరాడటమేమిటని సమాజాన్ని ప్రశ్నిస్తూ స్ర్తీ ప్రాదాన్యత గురించి బాలత్రిపురసుందరి వివరించారు. ఈ సందర్భంగా పలువురు సాహితీవేత్తలను సంస్థ అధ్యక్షుడు చక్రవర్తుల సుబ్బారావు సత్కరించారు. చిత్తూరు జిల్లాకు చెందిన కవి, రచయిత పల్లిపట్టు నాగరాజు, విజయవాడకు చెందిన కోపరేటీవ్ డిప్యూటీ రిజిస్టార్ పెద్దింటి కిరణ్కుమార్, సంస్థ అధ్యక్షులు నెక్కంటి ప్రభాకరరావు తదితరులు పాల్గొన్నారు.