గోవుల అక్రమ తరలింపు..

ABN , First Publish Date - 2023-06-03T00:42:57+05:30 IST

కబేళాకు గోవులను తరలిస్తున్న వాహనాలను నూజివీడు రూరల్‌ పోలీసులు స్వాధీన పరుచుకుని గోవులను పాల్వంచ గో సంరక్షణ శాలకు తరలించారు.

గోవుల అక్రమ తరలింపు..

వాహనాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు

నూజివీడు టౌన్‌, జూన్‌ 2: కబేళాకు గోవులను తరలిస్తున్న వాహనాలను నూజివీడు రూరల్‌ పోలీసులు స్వాధీన పరుచుకుని గోవులను పాల్వంచ గో సంరక్షణ శాలకు తరలించారు. నూజివీడు రూరల్‌ ఎస్‌ఐ టి.రామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం గురువారం రాత్రి మూడు డీసీఎం వాహనాల్లో హనుమాన్‌ జంక్షన్‌ నుంచి హైదరాబాద్‌కు గోవులను అక్రమంగా తరలిస్తున్నారన్న సమాచారం మేరకు తుక్కులూరు బైపాస్‌ వద్ద సంబంధిత వాహనాలను సీజ్‌ చేసి ముగ్గురు డ్రైవర్లను అదుపులోకి తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వాహనాల్లోని ఆవులను పాల్వంచ గో సంరక్షణశాలకు తరలించినట్లు ఆయన తెలిపారు.

Updated Date - 2023-06-03T00:42:57+05:30 IST