కోడ్‌ ముగిసినా.. తొలగని ముసుగు

ABN , First Publish Date - 2023-03-26T00:23:58+05:30 IST

ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ ముగిసినా పట్టణంలో కొన్ని విగ్రహాలకు వేసిన ముసుగులు తొలగించలేదు. మెయిన్‌రోడ్‌లో ఉన్న దివంగత ప్రధాని రాజీవ్‌ గాంధీ విగ్రహానికి వేసిన ముసుగు నేటికీ తీయలేదు.

కోడ్‌ ముగిసినా.. తొలగని ముసుగు
రాజీవ్‌విగ్రహానికి ముసుగు

నరసాపురం టౌన్‌, మార్చి 25: ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ ముగిసినా పట్టణంలో కొన్ని విగ్రహాలకు వేసిన ముసుగులు తొలగించలేదు. మెయిన్‌రోడ్‌లో ఉన్న దివంగత ప్రధాని రాజీవ్‌ గాంధీ విగ్రహానికి వేసిన ముసుగు నేటికీ తీయలేదు. అయితే పక్కనే ఉన్న దివంగత సీఎం రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి మాత్రం ముసుగు తొలగించారు. ఇతర ప్రాంతాల్లో వేసిన ముసుగులు కూడా తీసివేశారు. ఒక్క రాజీవ్‌గాంఽధీ విగ్రహానికి తీయకపోవడంపై కాంగ్రెస్‌ నాయకులు గాదిరెడ్డి వనమయ్య మండిపడ్డారు. స్వామిభక్తిని పక్కనబెట్టి అన్ని విగ్రహాలకు వేసిన ముసుగుల్ని తొలగించాలని ఆయన కోరారు.

Updated Date - 2023-03-26T00:23:58+05:30 IST