6 కిలోల గంజాయి స్వాధీనం.. ముగ్గురి అరెస్ట్‌

ABN , First Publish Date - 2023-06-07T00:37:58+05:30 IST

: ఏలూరునగరం, పరిసర ప్రాంతా ల్లో గంజాయి విక్రయిస్తున్న ముగ్గురు నిందితులను త్రి టౌన్‌ సీఐ కెవిఎస్‌ వరప్రసాద్‌ అరెస్టు చేశారు.

6 కిలోల గంజాయి స్వాధీనం.. ముగ్గురి అరెస్ట్‌
స్వాధీనం చేసుకున్న గంజాయి

ఏలూరు క్రైం, జూన్‌ 6 : ఏలూరునగరం, పరిసర ప్రాంతా ల్లో గంజాయి విక్రయిస్తున్న ముగ్గురు నిందితులను త్రి టౌన్‌ సీఐ కెవిఎస్‌ వరప్రసాద్‌ అరెస్టు చేశారు. ఏలూరు కట్టాసుబ్బా రావుతోట ప్రాంతానికి చెందిన కానాల రవితేజ, గ్జేవియర్‌నగర్‌ కు చెందిన నడుపూరు కళ్యాణ్‌, అల్లూరి సీతారామరాజు జిల్లా కొత్తవీధి మండలం గుడివాడ గ్రామానికి చెందిన కూసంగి వీరబాబు అలియాస్‌ వీర అలియాస్‌ దేవ అనే ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. హేలాపురి సిటీ వెంచర్‌లో నిందితులు ఉన్నట్లు సమాచారం రావడంతో సీఐ సిబ్బందితో వెళ్లి అరెస్టు చేసి వారి నుంచి 6కిలోల300 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. న్యాయస్ధానం ముందు హాజరుపరుచగా 14 రోజులు రిమాండ్‌ విధించారు.

Updated Date - 2023-06-07T00:37:58+05:30 IST