ప్రభుత్వోద్యోగుల సమస్యలు పరిష్కరించాలి

ABN , First Publish Date - 2023-05-31T23:39:09+05:30 IST

ప్రభుత్వోద్యోగుల సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వో ద్యోగుల సంఘం జిల్లా కార్యదర్శి ఎంఎస్‌వి.రామకృష్ణారావు డిమాండ్‌ చేశారు.

ప్రభుత్వోద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
పోలవరం తహసీల్దార్‌ కార్యాలయం వద్ద ఉద్యోగుల రిలే దీక్ష

పోలవరం, మే 31: ప్రభుత్వోద్యోగుల సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వోద్యోగుల సంఘం జిల్లా కార్యదర్శి ఎంఎస్‌వి.రామకృష్ణారావు డిమాండ్‌ చేశారు. తహసీల్దారు కార్యాలయం వద్ద బుధవారం చేపట్టిన రిలే నిరాహార దీక్షల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. డీఏ బకాయిలు సకాలంలో ఇవ్వాలని, 11 పీఆర్సీ బకాయిలు, సకాలంలో జీతాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. 20 ఏళ్ల సర్వీసు కలిగిన కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్‌ చేయాలని కోరారు. జూన్‌ 8న జిల్లా కలెక్టర్లకు విజ్ఞాపన పత్రాలు ఇస్తామని, ప్రభుత్వం చాయ్‌ బిస్కట్‌ చర్చలు కాకుం డా అర్థవంతమైన చర్యలు జరపి సమస్యల పరిష్కరిస్తుందని వేచి చూస్తున్నామ న్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ ఉద్యోగుల సంఘం మండల అధ్యక్షుడు ఎం.వెంకటేశ్వరరావు, కార్యదర్శి, డీటీ కాజా రమేశ్‌, జుత్తిక శ్రీనివాసరావు పాల్గొన్నారు.

Updated Date - 2023-05-31T23:39:09+05:30 IST