అగ్రిగోల్డ్‌ బాధితులకు న్యాయం చేస్తాం : ఆరిమిల్లి

ABN , First Publish Date - 2023-05-31T23:20:09+05:30 IST

తొమ్మి దేళ్లుగా పోరాడుతున్నా అగ్రిగోల్డ్‌ బాధితులకు న్యాయం జరగలేదని, టీడీపీ అధికారంలోకి వచ్చాక వారికి న్యాయం చేస్తామని మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు.

అగ్రిగోల్డ్‌ బాధితులకు న్యాయం చేస్తాం : ఆరిమిల్లి
సమావేశంలో మాట్లాడుతున్న ఆరిమిల్లి

తణుకు, మే 31: తొమ్మి దేళ్లుగా పోరాడుతున్నా అగ్రిగోల్డ్‌ బాధితులకు న్యాయం జరగలేదని, టీడీపీ అధికారంలోకి వచ్చాక వారికి న్యాయం చేస్తామని మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. బుధవారం తణుకులో అగ్రిగోల్డ్‌ బాధితుల సమస్యల పరిష్కారం కోసం రాజకీయ పార్టీలతో రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో ఆయన మాట్లాడారు. సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ళ నాగేశ్వరరావు మాట్లాడుతూ హామీలు అమలు చేయకుంటే జగన్‌ను గద్దె దించడం ఖాయమ న్నారు. అగ్రిగోల్డ్‌ బాధిత సంఘ రాష్ట్ర ఉప కార్యదర్శి బీవీ చంద్రశేఖర్‌ మాటా ్లడుతూ అగ్రిగోల్డ్‌ ఆస్తులను యాజమాన్యం రహస్యంగా అమ్మేస్తోంటే సీఎం జగన్‌ చోద్యం చూస్తున్నారన్నారు. సీపీఎం పట్టణ కార్యదర్శి పీవీ ప్రతాప్‌, జనసేన ఇన్‌చార్జి విడివాడ రామచంద్రరావు, సీపీఎం జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు ప్రసంగించారు. సంఘ రాష్ట్ర మహిళా కార్యదర్శి నాగలక్ష్మి, శ్రీనివాసు, బొద్దాని నాగరాజు, బొల్లాడ నాగరాజు, కామన మునిస్వామి, గార రంగారావు పాల్గొన్నారు.

Updated Date - 2023-05-31T23:20:09+05:30 IST