వైసీపీ పాలనలో యువత భవిష్యత్తు నిర్వీర్యం

ABN , First Publish Date - 2023-03-31T00:26:55+05:30 IST

వైసీపీ పాలనలో యువత భవిష్యత్తు నిర్వీర్యం అవుతోందని ఉపాధి, ఉద్యోగాలు లేక చెడు వ్యసనాలకు బానిసలు అవుతున్నారని గణపవరం మండల టీడీపీ అధ్యక్షుడు ఇందుకూరి రామకృష్ణంరాజు ఆరోపించారు.

వైసీపీ పాలనలో యువత భవిష్యత్తు నిర్వీర్యం
పిప్పరలో ఇదేం ఖర్మ మన రాష్ర్టానికి కార్యక్రమంలో టీడీపీ నాయకులు

టీడీపీ గణపవరం మండల అధ్యక్షుడు ఇందుకూరి

గణపవరం, మార్చి 30: వైసీపీ పాలనలో యువత భవిష్యత్తు నిర్వీర్యం అవుతోందని ఉపాధి, ఉద్యోగాలు లేక చెడు వ్యసనాలకు బానిసలు అవుతున్నారని గణపవరం మండల టీడీపీ అధ్యక్షుడు ఇందుకూరి రామకృష్ణంరాజు ఆరోపించారు. గురువారం పిప్పరలో ఇదేం ఖర్మ మన రాష్ర్టానికి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పార్టీ గ్రామ నాయకులతో కలిసి ఇంటింటికి తిరుగుతూ టీడీపీ హయాంలో జరిగిన అభివృద్ధి పనులు, వైసీపీ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై ప్రజలకు వివరించారు. ఇందుకూరి మురళీ, ఇందుకూరి మార్రాజు, గుండుగొలను బాబూరావు, దొమ్మేటి సూర్యనారాయణ, రంగరాజు తదితరులు పాల్గొన్నారు.

కవిటం గ్రామంలో..

పోడూరు, మార్చి 30 : కవిటం గ్రామంలో టీడీపీ నాయకులు గురువారం ఇదేం ఖర్మ మనరాష్ర్టానికి కార్యక్రమం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి ప్రజలను సమస్యలను అడిగి నమోదు చేసుకున్నారు. ఈ సందర్బంగా ఆచంట నియోజక వర్గ టీడీపీ సమన్వయ కమిటీ సభ్యుడు మేడపాటి గంగాధరరెడ్డి మాట్లాడుతూ జగన్‌ పాలనలో ధరలు విపరీతంగా పెరిగిపోయాయని సామాన్యప్రజలు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. త్వరలో చంద్రబాబును సీఎంను చేసేందుకు ప్రజలు ఎదురుచూస్తున్నారన్నారు. పార్టీ గ్రామ అధ్యక్షుడు గుబ్బల అప్పన్నస్వామి, కార్యదర్శి ఊడిగ శ్రీనివాసరావు, టీడీపీ మండల బీసీ సెల్‌ అధ్యక్షుడు దొంగ గరగయ్య, బొక్కా శ్రీను పెనుమాక వీర్రాజు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-31T00:26:55+05:30 IST