ఆక్సిజన్ ప్లాంట్ వద్దు
ABN , First Publish Date - 2023-06-03T00:38:54+05:30 IST
ఆక్సిజన్ ప్లాంట్ నిర్మాణంలో ప్రజాభిప్రాయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళతామని ట్రైనీ కలెక్టర్ అపూర్వ భరత్ అన్నారు.
కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్తామన్న ట్రైనీ కలెక్టర్
కైకలూరు, జూన్ 2: ఆక్సిజన్ ప్లాంట్ నిర్మాణంలో ప్రజాభిప్రాయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళతామని ట్రైనీ కలెక్టర్ అపూర్వ భరత్ అన్నారు. శుక్రవారం కైకలూరు మండలం నరసాయిపాలెంలో ఆక్సిజన్ ప్లాంట్ నిర్మాణంపై గ్రామసభ వివిధ శాఖల అధికారుల ఆధ్వర్యంలో నిర్వహించారు. గ్రామంలో ఉన్న ఒక్క మంచినీటి చెరువు ఆక్సిజన్ ప్లాంట్ నిర్మాణంతో నీరు కలుషితమమై గ్రామస్థులు అనారోగ్యంపాలవుతారని, తక్షణమే ప్లాంట్ నిర్మాణం నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు. గ్రామ సమస్యలపై స్పందించని అధికారులు ఇంత పెద్దఎత్తున వచ్చి సమావేశం నిర్వహించడంపై గ్రామ స్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తహసీల్దార్ బి. మురళీకృష్ణ, ఎంపీడీవో రామ లింగేశ్వరరావు, ఆర్డబ్ల్యూఎస్, ఇరిగేషన్, మత్స్యశాఖ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, పంచాయతీరాజ్ శాఖ అధికారులు పాల్గొన్నారు.