సృజనాత్మకతను వెలికితీసేందుకు ఫైౖన్‌ఆర్ట్స్‌ దోహదం

ABN , First Publish Date - 2023-03-31T00:26:58+05:30 IST

విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికితీసేందుకు ఫైౖన్‌ ఆర్ట్స్‌ దోహదపడుతుందని రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్‌ నాలెడ్జ్‌ అండ్‌ టెక్నాలజీ వైస్‌ ఛాన్సలర్‌ ఎం.విజయ్‌ కుమార్‌ అన్నారు.

సృజనాత్మకతను వెలికితీసేందుకు ఫైౖన్‌ఆర్ట్స్‌ దోహదం
ఆర్ట్స్‌ ఎగ్జిబిషన్‌ను తిలకిస్తున్న ఆర్జీయూకేటీ వీసీ విజయ్‌కుమార్‌

నూజివీడు, మార్చి 30: విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికితీసేందుకు ఫైౖన్‌ ఆర్ట్స్‌ దోహదపడుతుందని రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్‌ నాలెడ్జ్‌ అండ్‌ టెక్నాలజీ వైస్‌ ఛాన్సలర్‌ ఎం.విజయ్‌ కుమార్‌ అన్నారు. నూజివీడు ట్రిపుల్‌ ఐటీ క్యాంపస్‌లో అంతర్భాగంగా నడుస్తున్న శ్రీకాకుళం ట్రిపుల్‌ ఐటీ విద్యార్థులు ఫైౖన్‌ ఆర్ట్స్‌ ఎగ్జిబిషన్‌ను నిర్వహించారు. విజయ్‌కుమార్‌ దీనిని గురువారం లాంఛనంగా ప్రారంభించి మాట్లాడారు. విద్యార్థుల్లో నిగూఢంగా ఉన్న సృజనాత్మ కతను ఫైౖన్‌ఆర్ట్స్‌ వెలికితీస్తాయన్నారు. తాను ఊహించిన దాని కన్నా విద్యార్థులు ఎంతో రాణించారన్నారు. విద్యార్థినీ విద్యార్థులకు ప్రశంసా పత్రాలు, మెడల్స్‌ అందజేశారు. నూజివీడు ట్రిపుల్‌ ఐటీ డైరెక్టర్‌ జి.వి.ఆర్‌. శ్రీనివాసరావు, మోహన్‌రావు, శ్రీకాకుళం ఏవో ఎం.రామకృష్ణ, అకాడమిక్‌ కోఆర్డినేటర్‌ సతీష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-31T00:26:58+05:30 IST