చర్చిని ప్రారంభించిన బ్రదర్‌ అనిల్‌

ABN , First Publish Date - 2023-02-02T00:26:32+05:30 IST

పెదలంకలో నూతనంగా నిర్మించిన చర్చిని ఏడబ్ల్యూఈ మినిస్ట్రీస్‌ అంతర్జాతీయ వర్తమా నికుడు బ్రదర్‌ అనిల్‌ కుమార్‌ బుధవారం ప్రారంభించారు.

 చర్చిని ప్రారంభించిన బ్రదర్‌ అనిల్‌

కలిదిండి, ఫిబ్రవరి 1 : పెదలంకలో నూతనంగా నిర్మించిన చర్చిని ఏడబ్ల్యూఈ మినిస్ట్రీస్‌ అంతర్జాతీయ వర్తమా నికుడు బ్రదర్‌ అనిల్‌ కుమార్‌ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మారుమూల ప్రాంతంలో అత్యాధునిక హంగులతో నిర్మించిన చర్చిని ప్రారంభించటం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు. హోలి గాడ్‌ చర్చి నిర్మాణానికి కృషి చేసిన జాన్‌ మంగాచార్యులను అభినందించారు. భక్తిశ్రద్ధలతో ప్రార్థనలు నిర్వహించి దేవుని మందిరాన్ని దైవంగా భావించా లన్నారు. అనంతరం సుమారు 5 వేల మందికి అన్నసమారాధన నిర్వహించారు. ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు, ఏపీ క్రిస్టియన్‌ మైనార్టీ అధ్యక్షుడు మేడిది జాన ్సన్‌, తూర్పు గోదావరి జిల్లా పాస్టర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు బిషప్‌ దానియేలు పాల్‌, సర్పంచ్‌ లక్ష్మీ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-02-02T00:26:33+05:30 IST