Share News

19 నుంచి జాతీయస్థాయి నాటిక పోటీలు

ABN , Publish Date - Dec 17 , 2023 | 12:15 AM

తోలేరు సుబ్రహ్మణ్యేశ్వర కళా పరిషత్‌ ప్రతీ ఏటా నిర్వహించే జాతీయస్థాయి నాటిక పోటీలకు ఆరు నాటికలను ఎంపిక చేసినట్టు కళాపరిషత్‌ అధ్యక్షుడు చవాకుల సత్యనారాయణ తెలిపారు.

19 నుంచి జాతీయస్థాయి నాటిక పోటీలు

వీరవాసరం, డిసెంబరు 16: తోలేరు సుబ్రహ్మణ్యేశ్వర కళా పరిషత్‌ ప్రతీ ఏటా నిర్వహించే జాతీయస్థాయి నాటిక పోటీలకు ఆరు నాటికలను ఎంపిక చేసినట్టు కళాపరిషత్‌ అధ్యక్షుడు చవాకుల సత్యనారాయణ తెలిపారు. 19వ జాతీయస్థాయి నాటిక పోటీల వేదికపై వీటిని సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి సందర్భంగా ఈ నెల 19వ తేదీ నుంచి ప్రారంభిస్తామన్నారు. వివిధ కళాపరిషత్‌కు చెందిన నాటికలను ఎంపికచేశారు. హర్ష క్రియేషన్స్‌ విజయవాడ వారి స్వర్ణ కమలాలు , చైతన్య కళాభారతి కరీమ్‌నగర్‌ వారి చీకటి పువ్వు, గోరివంక శార్వాని గిరిజన సాంస్కృతిక సేవాకేంద్రం వారి కొత్త పరిమళం నాటికలను ఎంపికచేశారు. హైదరాబాద్‌ సిరిమువ్వ కల్చరల్‌ వారి థింక్‌ , కట్లపాడు ఉషోదయ కళానికేతన్‌ వారి విముక్తి, గుంటూరు అమృత లహరి ఆర్ట్స్‌ వారి నాన్న నేను వచ్చేస్తా నాటికలను ఎంపిక చేశామన్నారు. సినీ నటులు ఆర్‌.నారాయణమూర్తి, ఎన్‌.సుబ్బరాజు శర్మలకు, రంగస్థల నటుడు గుమ్మడి గోపాలకృష్ణకు గౌరవ సత్కారం ఏర్పాటు చేసి నట్టు తెలిపారు.

Updated Date - Dec 17 , 2023 | 12:15 AM