Kotam Reddy: నెల్లూరు జిల్లాలో పది స్థానాలూ గెలుస్తాం: కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డి

ABN , First Publish Date - 2023-03-27T20:32:03+05:30 IST

రానున్న ఎన్నికల్లో నెల్లూరు జిల్లా (Nellore District)లో పది స్థానాల్లోనూ టీడీపీ (TDP) విజయం సాధిస్తుందని టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డి (Kotam Reddy Giridhar Reddy) అన్నారు.

Kotam Reddy: నెల్లూరు జిల్లాలో పది స్థానాలూ గెలుస్తాం: కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డి

అనంతపురం: రానున్న ఎన్నికల్లో నెల్లూరు జిల్లా (Nellore District)లో పది స్థానాల్లోనూ టీడీపీ (TDP) విజయం సాధిస్తుందని టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డి (Kotam Reddy Giridhar Reddy) అన్నారు. టీడీపీలో చేరిన తాను, సామాన్య కార్యకర్తలా స్థానిక నాయకులందరితో కలిసి పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తానని అన్నారు. శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల మండల కేంద్ర సమీపంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ (NaraLokesh)ను సోమవారం ఆయన కలిశారు. యువగళం పాదయాత్రకు సంఘీబావం తెలిపారు. ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడుతూ... తమ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ చేపట్టిన యువగళం పాదయాత్రను అన్నివర్గాల ప్రజలు ఆదరిస్తున్నారని అన్నారు. ప్రజల ఆదరణ ఉన్నంత వరకూ టీడీపీని ఎవరూ అడ్డుకోలేరని అన్నారు. ఎవరెన్ని ఆంక్షలు పెట్టినా యువగళం జనప్రభంజనంలా సాగిపోతుందని పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో ఎలాంటి ఇబ్బందులనూ లెక్కచేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. తాను తెలుగుదేశం పార్టీలో సామాన్య కార్యకర్తగానే చేరానని అన్నారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు, లోకేశ్‌ ఆదేశాలతో, వారు ఏం చెబితే ఆ పని చేసేందుకు సిద్ధంగా ఉన్నానని అన్నారు. తన సోదరుడు, నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి (Kotam Reddy Sridhar Reddy)ని వైసీపీ కొత్తగా సస్పెండ్‌ చేసేదేమీ లేదని అన్నారు. తాము అంతకుముందు రెండు నెలలుగా ఆ పార్టీకి దూరంగా ఉన్నామని అన్నారు. నియోజకవర్గ సమస్యలను పరిష్కరించకపోవడం, ఫోన్‌ ట్యాపింగ్‌ నేపథ్యంలో తాము జగన్‌తో ఉండకూడదని నిర్ణయించుకున్నామని అన్నారు.

Updated Date - 2023-03-27T20:32:03+05:30 IST