టీడీపీ మేనిఫెస్టోతో వైసీపీ హడల్‌

ABN , First Publish Date - 2023-06-03T00:33:18+05:30 IST

మహానాడులో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ప్రక టించిన మేనిఫెస్టోను చూసి వైసీపీ హడలెత్తిపోతోందని టీడీపీ పాలకొండ నియోజకవర్గ ఇన్‌చార్జి నిమ్మక జయకృష్ణ పేర్కొన్నారు.

టీడీపీ మేనిఫెస్టోతో వైసీపీ హడల్‌
చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేస్తున్న జయకృష్ణ

పాలకొండ: మహానాడులో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ప్రక టించిన మేనిఫెస్టోను చూసి వైసీపీ హడలెత్తిపోతోందని టీడీపీ పాలకొండ నియోజకవర్గ ఇన్‌చార్జి నిమ్మక జయకృష్ణ పేర్కొన్నారు. పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో చంద్రబాబు చి త్రపటానికి శుక్రవారం పాలాభిషేకం చేశా రు. ఈ సందర్భంగా జయకృష్ణ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంపై ప్రజలు విసుగుచెందారని.. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా టీడీపీ విజయం ఖాయమ న్నారు. వైసీపీ పతనానికి ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలే ఉదాహరణ అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు గండి రామినాయుడు, గండి పద్మావతి, కరణం వెంకటరత్నం, కోట భవాని, కోడి అనూష, కిమిడి కాశింనాయుడు, చేబోతుల లక్ష్మీనారాయణ, కరణం వరహాలనాయుడు తదితరులు పాల్గొన్నారు.

విజన్‌ ఉన్న నాయకుడు చంద్రబాబు

గరుగుబిల్లి: విజన్‌ ఉన్న నాయకుడు చంద్రబాబు అని అరకు తెలుగుదేశం పార్టీ బీసీ సెల్‌ అధికార ప్రతినిధి ద్వారపురెడ్డి సత్యనారాయణ అన్నారు. మండలంలోని శివ్వాం గ్రామంలో టీడీపీ కార్యకర్తలతో ఆయన శుక్రవారం ప్రత్యేక సమావేశం ఏర్పాటుచేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 10వ తేదీ నుంచి భవిష్యత్‌కు గ్యారెంటీ కార్యక్రమంపై ఇంటింటి ప్రచారం చేయనున్నట్లు తెలిపారు. రానున్న ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా చంద్రబాబును గద్దెనెక్కించడమే ధ్యేయంగా పని చేయాల ని పిలుపునిచ్చారు. వైసీపీ అరాచక పాలనకు స్వస్తి పలకాలని కోరారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు బి.నారాయణస్వామి, బి.మోహనరావు, కె.బలరాంనాయుడు, బి.చంద్రరావు, పి.ఆదినారాయణ, డి.సూర్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-03T00:33:39+05:30 IST