పనులను నాణ్యతగా చేపట్టాలి
ABN , First Publish Date - 2023-06-03T00:39:11+05:30 IST
గ్రామాల్లో అభివృద్ధి పనులను నాణ్యతగా చేపట్టాలని, ఎలాంటి నిర్లక్ష్యం వహించవద్దని ఐటీడీఏ ప్రాజెక్టు డైరెక్టర్ సి.విష్ణుచరణ్ అధికారులను ఆదేశించారు.
పార్వతీపురం, జూన్ 2: గ్రామాల్లో అభివృద్ధి పనులను నాణ్యతగా చేపట్టాలని, ఎలాంటి నిర్లక్ష్యం వహించవద్దని ఐటీడీఏ ప్రాజెక్టు డైరెక్టర్ సి.విష్ణుచరణ్ అధికారులను ఆదేశించారు. మండలంలోని బొండపల్లి, తదితర గ్రామాల్లో జరుగుతున్న గడపగడపపకు మన ప్రభుత్వం పనులను శుక్రవారం ఆయన పరిశీలించారు. సీసీ రోడ్లు, మురుగు కాలువల పనులు ఎంత మేరకు జరుగుతున్నది అడిగితెలుసుకున్నారు. నాణ్యతలో రాజీపవద్దని, పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ ఏఈ చంద్రమౌళి, సచివాలయ ఇంజనీరింగ్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు.
అంగన్వాడీ సిబ్బంది నియామకానికి ఇంటర్వ్యూలు
జిల్లాలోని కొమరాడ, పార్వతీపురం తదితర ప్రాంతాల్లోని అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న సిబ్బంది నియామకానికి శుక్రవారం ఇంటర్వ్యూలు నిర్వహించారు. పీవో విష్ణుచరణ్ పర్యవేక్షణలో ఐటీడీఏ గిరిమిత్ర సమావేశ మందిరంలో ఈ ఇంటర్వ్యూలు జరిగాయి. డీఎంహెచ్వో డాక్టర్ జగన్నాథరావు, ఇన్చార్జి పీడీ విజయగౌరి, ఏవో ప్రసాద్ తదితర అధికారులు అభ్యర్థినులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు.