ద్విచక్ర వాహనం బోల్తా.. వ్యక్తి మృతి
ABN , First Publish Date - 2023-04-03T00:29:58+05:30 IST
మండలంలోని మోకాలుపాడు గ్రామం వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతిచెందాడు.
గంట్యాడ: మండలంలోని మోకాలుపాడు గ్రామం వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతిచెందాడు. దీనికి సంబంధించి స్థానిక పోలీసు లు, స్థానికులు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. కొత్తవెలగాడ గ్రామానికి చెందిన ఆర్.గౌరినాయుడు(42) అనే వ్యక్తి తన సొంత పనుల్లో భాగంగా ద్విచక్ర వాహనంపై బోనంగి గ్రామానికి వెళ్తున్నాడు. మోకాలుపాడు గ్రామం వద్దకు వచ్చేసరికి వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో గౌరినాయుడు అక్కడిక క్కడే మృతిచెందాడు. గౌరినాయుడుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అందిన ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.