రెండు లారీలు ఢీ
ABN , First Publish Date - 2023-03-31T00:07:40+05:30 IST
భోగాపురం సమీప జాతీయ రహదారిపై గురువారం వేకువ జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒడిసా రాష్ట్రానికి చెందిన నఫీజ్ హనీ అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.
భోగాపురం: భోగాపురం సమీప జాతీయ రహదారిపై గురువారం వేకువ జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒడిసా రాష్ట్రానికి చెందిన నఫీజ్ హనీ అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాలు ఇలా ఉన్నాయి. గురువారం వేకువజామున విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం వైపు వస్తున్న ఓ లారీ భోగాపురం జాతీయ రహదారి సమీపంలోకి వచ్చేసరికి, డివైడర్ను ఢీకొట్టి, ఆ తర్వాత అవతలి రోడ్డులో శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం వైపు వెళ్తున్న లారీని బలంగా ఢీకొట్టింది. దీంతో ఆ రెండు లారీల ముందు భాగాలు నుజ్జయ్యాయి. ప్రమాదానికి కారణమైన లారీలో డ్రైవర్ చిక్కుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, రెండు లారీలను వేరు చేసి, గాయాలపాలైన డ్రైవర్ నఫీజ్ హనీని బయటికి తీశారు. చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పెను ప్రమాదం తప్పిందని స్థానికులు అనుకుంటున్నారు. దీనిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక పోలీసులు తెలిపారు.