రెండు పశువుల శాలలు దగ్ధం

ABN , First Publish Date - 2023-06-03T00:20:54+05:30 IST

ఒంపల్లి గ్రామంలో శుక్రవారం మధ్యాహ్నం జరిగిన అగ్ని ప్రమా దంలో రెండు పశువుల శాలలు దగ్ధం కావడంతో పాటు మూడు గొర్రెలు మృతి చెందాయి.

  రెండు పశువుల శాలలు దగ్ధం

బొండపల్లి: ఒంపల్లి గ్రామంలో శుక్రవారం మధ్యాహ్నం జరిగిన అగ్ని ప్రమా దంలో రెండు పశువుల శాలలు దగ్ధం కావడంతో పాటు మూడు గొర్రెలు మృతి చెందాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన గొర్లె గౌరినా యుడుకు చెందిన పశువుల శాలలో శుక్రవారం జరిగిన అగ్నిప్రమాదంలో శాలలో కట్టి ఉంచిన మూడు గొర్రెలు పూర్తిగా కాలిపోయి, మృతిచెందాయి. మరో మూడు గొర్రెలు పాక్షికంగా కాలి, గాయాలపాలయ్యాయి. అలాగే అదే శాలలో ఉంచిన ఒక సైకిల్‌ కూడా కాలిపోయింది. ఆ శాలకు పక్కనే ఉన్న మరో శాలకు కూడా మంట లు అంటుకోవడంతో ఆ శాల కూడా కాలి బూడిదయ్యింది. అయితే అగ్నిమాపక వాహనానికి సమాచారం ఇచ్చేలోగా ఈ శాలలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదానికిగల కారణాలు తెలయరాలేదు. బాధితులు తమకు ప్రభుత్వం నష్టపరిహారం అందజేసి ఆదుకోవాలని కోరుతున్నారు.

Updated Date - 2023-06-03T00:20:54+05:30 IST