రిక్షాలో మృతదేహం తరలింపు

ABN , First Publish Date - 2023-06-26T23:54:02+05:30 IST

పార్వతీపురంలోని జిల్లా కేంద్రాసుపత్రిలో చనిపోయిన ఓ వ్యక్తిని ఇలా రిక్షాలో ఇంటికి తరలించడం స్థానికులను కలిచివేసింది. బరువెక్కిన హృదయంతో చలించిపోయారు.

రిక్షాలో మృతదేహం తరలింపు
రిక్షాలో మృతదేహాన్ని తీసుకెళ్తున్న దృశ్యం

పార్వతీపురం, జూన్‌ 26 (ఆంధ్రజ్యోతి)/పార్వతీపురంటౌన్‌ : పార్వతీపురంలోని జిల్లా కేంద్రాసుపత్రిలో చనిపోయిన ఓ వ్యక్తిని ఇలా రిక్షాలో ఇంటికి తరలించడం స్థానికులను కలిచివేసింది. బరువెక్కిన హృదయంతో చలించిపోయారు. వివరాల్లోకి వెళ్తే.. పట్టణంలోని వైకేఎం కాలనీకి చెందిన టి.కిషోర్‌ (34) అనారోగ్యం కారణంగా ఆదివారం అర్ధరాత్రి 2 గంటలకు ఆసుపత్రిలో చేరాడు. అయితే సోమవారం ఉదయం ఎనిమిది గంటలకు మృతి చెందాడు. ఆ సమయంలో జిల్లాకేంద్రాసుపత్రిలో అంబులెన్స్‌లు లేవు. దీంతో కుటుంబ సభ్యులు రిక్షా ద్వారా మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లాల్సి వచ్చింది. అసలు వైద్యాశాఖాధికారులు ఆదేశాల మేరకు జిల్లా కేంద్రాసుపత్రిలో మృతి చెందిన వ్యక్తులను వారి నివాసాలకు తీసుకెళ్లి బంధువులకు అప్పగిస్తుంటారు. అయితే అంబులెన్స్‌లు అందుబాటులో లేకపోవడం వల్ల కుటుంబ సభ్యులే అలా రిక్షాలో మృతదేహాన్ని తరలించారని అక్కడి వైద్యసిబ్బంది చెప్పుకొచ్చారు. ఇదిలా ఉండగా అధికంగా మద్యం తాగడం వల్ల మృతుడు కిషోర్‌ కిడ్నీలతో పాటు అవయవాలన్నీ పాడైపోయాయని, అందుకే మృతి చెందాడని వైద్యుడు రవికుమార్‌ తెలిపారు.

Updated Date - 2023-06-26T23:54:02+05:30 IST