పారదర్శకంగా బదిలీలు చేయాలి
ABN , First Publish Date - 2023-06-02T23:58:15+05:30 IST
ఉపాధ్యాయుల బదిలీ ప్రక్రియ పారదర్శకంగా చేపట్టాలని ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు మజ్జి మదన్మోహనరావు డిమాండ్చేశారు
రేగిడి: ఉపాధ్యాయుల బదిలీ ప్రక్రియ పారదర్శకంగా చేపట్టాలని ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు మజ్జి మదన్మోహనరావు డిమాండ్చేశారు. శుక్రవారం మండలం లోని ఏపీపురం ప్రాఽథమిక పాఠ శాలలో మండలస్థాయి ఉపాధ్యాయుల సమస్యలపై ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ బదిలీల ప్రక్రియలో పారదర్శకంగా జరిగేలా నిబంధనలు రూపొందిం చాలని కోరారు. కొన్ని పోస్టుల్లో బ్లాకింగ్ ఎత్తివేయాలని, పీఎస్హెచ్ఎంల ఖాళీలు పూర్తిగా చూపిం చాలని, అవసరమైతే ఫౌండేషన్ ప్లస్ పాఠశాలల్లో పీఎస్హెచ్ఎంలు నియమిం చేందుకు నిబంధనలు రూపొందించాలని కోరారు.సమావేశంలో ఏపీటీఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్ సీతంనాయుడు, ఏపీటీఎఫ్ ప్రతినిధులు రామకృష్ణ పాల్గొన్నారు.