ఇది జగనన్న కాలనీ దారి

ABN , First Publish Date - 2023-07-21T00:06:54+05:30 IST

రాజాం మున్సిపాలిటీ పరిధిలోని కంచరాం సమీపంలో జగనన్న కాలనీకి వెళ్లే దారిది. అక్కడ 1500 పైగా లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు కేటాయించిన ప్రభుత్వం కనీస సౌకర్యమైన రోడ్డును పూర్తి చేయలేకపోతోంది. దీంతో ఇళ్ల నిర్మాణ సామగ్రి తరలించడానికి పేదలు అనేక అవస్థలు పడుతున్నారు.

ఇది జగనన్న కాలనీ దారి

ఇది జగనన్న కాలనీ దారి

రాజాం మున్సిపాలిటీ పరిధిలోని కంచరాం సమీపంలో జగనన్న కాలనీకి వెళ్లే దారిది. అక్కడ 1500 పైగా లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు కేటాయించిన ప్రభుత్వం కనీస సౌకర్యమైన రోడ్డును పూర్తి చేయలేకపోతోంది. దీంతో ఇళ్ల నిర్మాణ సామగ్రి తరలించడానికి పేదలు అనేక అవస్థలు పడుతున్నారు. ఆ ఇబ్బందులకు విసుగుచెంది కొందరు నిర్మాణ పనులు ఆపేశారు. తాజా వర్షాలకు ద్విచక్ర వాహనం కూడా వెళ్లే పరిస్థితి లేదు. అక్కడి పరిస్థితిని స్థానిక అధికారులు కలెక్టర్‌ దృష్టికి తీసుకువెళ్లాక కంచరాం గ్రామం నుంచి రహదారి నిర్మాణానికి రూ2.05 కోట్లు మంజూరు చేశారు. కాంట్రాక్టర్‌కు పనులు కూడా అప్పగించారు. ఆయన మట్టి పనులు మాత్రమే చేసి వదిలేశారు. దీంతో పేరుకే రహదారి అన్నట్లు పరిస్థితి తయారైంది. ఈ విషయాన్ని ఏఈ ఆనందరావు వద్ద ప్రస్తావించగా మట్టి కొంచెం కిందకి దిగాక గ్రావెల్‌, మెటల్‌ వేస్తామని, అంతవరకు ఇబ్బందులు తప్పవని అన్నారు.

- రాజాం

Updated Date - 2023-07-21T00:06:54+05:30 IST