కార్మికుల కష్టాలు ప్రధానికి పట్టడంలేదు

ABN , First Publish Date - 2023-03-31T00:01:19+05:30 IST

రైతుల ఆత్మహత్యలు, కార్మికుల కష్టాలు ప్రధానమంత్రికి పట్టడంలేదని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్య దర్శి రామ్మూర్తినాయుడు ఆరో పించారు.

 కార్మికుల కష్టాలు ప్రధానికి పట్టడంలేదు

రాజాం రూరల్‌: రైతుల ఆత్మహత్యలు, కార్మికుల కష్టాలు ప్రధానమంత్రికి పట్టడంలేదని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్య దర్శి రామ్మూర్తినాయుడు ఆరో పించారు. మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా, కార్మిక, కర్షక, రైతాంగ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఏప్రిల్‌ ఐదో తేదీన ఢిల్లీలో నిర్వహించనున్న మజ్దూర్‌ కిసాన్‌ ఏక్తా పోరాట ప్రదర్శనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు గురువారం రాజాంలో ప్రదర్శన పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోదీ ఆఽధ్వర్యంలో బీజేపీ ప్రభుత్వం సమస్యలను మరింత జఠిలం చేస్తోందని ఆరోపించారు. అదానీ, అంబానీ వంటి పారిశ్రామికవేత్తల సేవలో మోదీ ప్రభుత్వం మునిగి తేలుతోందని విమర్శించారు. కార్యక్రమంలో రాజేష్‌, కృష్ణ, కనకరాజు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-31T00:01:19+05:30 IST