ఆపసోపాలు
ABN , First Publish Date - 2023-06-03T00:35:08+05:30 IST
తోడు లేనిదే బయటకు వెళ్లలేని విభిన్నప్రతిభావంతులు వారు. వైకల్య అర్హత ధ్రువీకరణ కోసం సదరం పరీక్షలకు శుక్రవారం వచ్చారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ఉదయం 9 గంటల నుంచి పడిగాపులు కాశారు. వైద్యులు సమయానికి రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
తోడు లేనిదే బయటకు వెళ్లలేని విభిన్నప్రతిభావంతులు వారు. వైకల్య అర్హత ధ్రువీకరణ కోసం సదరం పరీక్షలకు శుక్రవారం వచ్చారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ఉదయం 9 గంటల నుంచి పడిగాపులు కాశారు. వైద్యులు సమయానికి రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఉక్కబోతకు తోడు ఫ్యాన్ కూడా లేక అవస్థలు ఎదుర్కొన్నారు. వారితో వచ్చిన సహాయకులకు కూడా పాట్లు తప్పలేదు. చివరకు ఒంటిగంటకు వైద్యులు వచ్చి ప్రక్రియను ప్రారంభించారు. ఇదే విషయంపై ఆసుపత్రి సూపరింటెండెంట్ అప్పలనాయుడిని వివరణ కోరగా సదరం పరీక్షలకు సంబంధించిన వైద్యులు ఆపరేషన్ థియేటర్లో శస్త్ర చికిత్స చేయడం వల్ల ఇక్కడకు రావడం ఆలస్యమైందన్నారు.
- విజయనగరం రింగురోడ్డు