లోకేశ్‌పై దాడి పిరికిపంద చర్య

ABN , First Publish Date - 2023-06-03T00:34:45+05:30 IST

వైఎస్సార్‌ కడప జిల్లా ప్రొద్దుటూరులో పాదయాత్ర చేస్తున్న లోకేశ్‌పై వైసీపీ నాయకులు కోడిగుడ్లతో దాడిచేయడం పిరికిపంద చర్య అని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యురాలు, మాజీ ఎమ్మెల్సీ గుమ్మిడి సంధ్యారాణి విమర్శించారు. శుక్రవారం ఆమె తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు.

లోకేశ్‌పై దాడి పిరికిపంద చర్య
మాట్లాడుతున్న టీడీపీ పోలిట్‌బ్యూరో సభ్యురాలు గుమ్మిడి సంధ్యారాణి

సాలూరు, జూన్‌ 2: వైఎస్సార్‌ కడప జిల్లా ప్రొద్దుటూరులో పాదయాత్ర చేస్తున్న లోకేశ్‌పై వైసీపీ నాయకులు కోడిగుడ్లతో దాడిచేయడం పిరికిపంద చర్య అని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యురాలు, మాజీ ఎమ్మెల్సీ గుమ్మిడి సంధ్యారాణి విమర్శించారు. శుక్రవారం ఆమె తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. యువగళం పాదయాత్రకు వస్తున్న ప్రజాదరణ చూసి జగన్‌ అండ్‌ కో ఓర్వలేక లోకేశ్‌పై కోడిగుడ్లతో దాడి చేశారని, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. ఈ అధికారం మీకు శాశ్వతమా? అని ప్రశ్నించారు. వైసీపీ నేతలు చేస్తున్న అరాచకాలను గుర్తు పెట్టుకుంటున్నామని, తాము అధికారంలోకి వచ్చాక వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తామన్నారు. జగన్‌ సొంత జిల్లాలో వైసీపీ ఉనికిని కోల్పోయే పరిస్థితి ఉందన్నారు. దానిని తట్టుకోలేక ఈ తరహా దాడులు చేస్తున్నారన్నారు. లోకేష్‌ పాదయత్రకు భద్రత కల్పించాలని డిమాండ్‌ చేశారు. సెక్యూరిటీని తొలగిస్తే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును ఫినిష్‌ చేస్తానని స్పీకర్‌ బెదిరించడం దారుణమన్నారు. టీడీపీ కార్యకర్తలు శక్తిలేని వారు కాదని, ఈ విషయాన్ని వైసీపీ నేతలు గమనిస్తే మంచిదని హితవుపలికారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు వైకుంఠపు హర్షవర్ధన్‌, తర్లాడ లక్ష్మోజీ, యుగంధర్‌, మజ్జి చిరంజీవి, శ్యామ్‌ ,చిన్ని, పప్పల మోహన్‌రావు, వెంకటరమణ, టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-03T00:34:45+05:30 IST