రేపటి నుంచి టెన్త్ సప్లిమెంటరీ
ABN , First Publish Date - 2023-06-01T00:08:41+05:30 IST
జిల్లాలో శుక్రవారం నుంచి 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు డీఈవో నిమ్మక ప్రేమ్కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు.
పార్వతీపురం, మే31 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో శుక్రవారం నుంచి 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు డీఈవో నిమ్మక ప్రేమ్కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. మొత్తంగా తొమ్మిది కేంద్రాల్లో ఈ పరీక్షల నిర్వహణకు ఏర్పాటు పూర్తిచేశామన్నారు. 1,338 మంది విద్యార్థులు హాజరుకానున్నారని పేర్కొన్నారు. పరీక్ష కేంద్రాల్లో అవసరమైన తాగునీరు, ఫస్ట్ ఎయిడ్ ఏర్పాటు చేశామని, ఇన్విజిలేటర్లను నియమించామని తెలిపారు. మాస్కాపీయింగ్ జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామన్నారు. రోజూ ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 వరకు పరీక్షలు జరుగుతాయన్నారు.