పాము కాటుతో విద్యార్థి మృతి
ABN , First Publish Date - 2023-06-03T00:19:08+05:30 IST
పాము కాటుతో ఇంటర్ విద్యార్థి మృతిచెందిన సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది.
పార్వతీపురంటౌన్/ గుమ్మలక్ష్మీపురం: పాము కాటుతో ఇంటర్ విద్యార్థి మృతిచెందిన సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. జిల్లా ఆసుపత్రి ఔట్పోస్టు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుమ్మలక్ష్మీపురం మండలం డొంగరకెక్కువ గ్రామానికి చెందిన కోలక కిషోర్(18) అనే ఇంటర్ విద్యార్థి శుక్రవారం ఉదయం బహిర్భూమికి వెళ్తుండగా పాము కాటు వేసింది. వెంటనే కుటుంబీకులు భద్రగిరి ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అక్కడ ప్రథమ చికిత్స చేసి, పార్వతీపురం జిల్లా ఆసుపత్రి కి తరలించారు. అక్కడ చికిత్స అందించేలోపే మృతిచెందాడు.