వేంకటేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు
ABN , Publish Date - Dec 29 , 2023 | 12:05 AM
మండల కేంద్రం వేపాడలో గల శ్రీదేవి, భూదేవి సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆల యధర్మకర్త రాపర్తి చిరంజీవి ప్రసాద్ సారధ్యంలో వేదపండితుల మంత్రో చ్చారణలో స్వామికి అష్టోత్తర, శతనామావళి, నక్షత్ర హారతి, కర్పూర హారతి, పట్టువస్త్రాలంకారణ వంటి ప్రత్యేక పూజలు చేశారు.
వేపాడ: మండల కేంద్రం వేపాడలో గల శ్రీదేవి, భూదేవి సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆల యధర్మకర్త రాపర్తి చిరంజీవి ప్రసాద్ సారధ్యంలో వేదపండితుల మంత్రో చ్చారణలో స్వామికి అష్టోత్తర, శతనామావళి, నక్షత్ర హారతి, కర్పూర హారతి, పట్టువస్త్రాలంకారణ వంటి ప్రత్యేక పూజలు చేశారు. వందలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని, 25 కేజీలతో తయారు చేసిన పులిహోరా, పండ్లు ప లహారాలు, జిలేబీలు నైవేధ్యంగా సమర్పించుకున్నారు. ఎస్.కోటకు చెందిన భక్తు లు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. బొద్దాం గ్రామంలో గల కన్యకామరమేశ్వరి అమ్మ వారిని వేలాది భక్తులు దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు.