Share News

ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించండి

ABN , First Publish Date - 2023-11-22T00:10:26+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల సమ స్యలు తక్షణమే పరిష్క రించాలని ఆర్టీసీ కార్మిక యూనియన్‌ అధ్యక్ష, ప్రఽధాన కార్యదర్శులు పీజీ రాఫెల్‌, బీఎస్‌ రాములు డిమాండ్‌ చేశారు. జోనల్‌ కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు ఆర్టీసీ కాంప్లెక్స్‌ సమీపంలో నిరహార దీక్ష శిబిరాన్ని నిర్వహించారు

ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించండి

విజయనగరం రింగురోడ్డు, నవంబరు 21: రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల సమ స్యలు తక్షణమే పరిష్క రించాలని ఆర్టీసీ కార్మిక యూనియన్‌ అధ్యక్ష, ప్రఽధాన కార్యదర్శులు పీజీ రాఫెల్‌, బీఎస్‌ రాములు డిమాండ్‌ చేశారు. జోనల్‌ కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు ఆర్టీసీ కాంప్లెక్స్‌ సమీపంలో నిరహార దీక్ష శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈడీ సమస్యలు పరి ష్కరించని కారణంగా నిరహార దీక్ష చేస్తున్నామన్నారు. రాష్ట్ర కోశాధికారి పీవీ మోహన్‌ మాట్లాడుతూ అక్రమ సస్పెన్షన్లను రద్దు చేయాలని కోరారు. 12,019 స ర్క్యులర్‌ అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. యూనియన్‌ నాయకులపై కక్ష సాధింపు చర్యలు విడనాడాలన్నారు. బీఎస్‌ రాములు, సత్యం, చంద్రమౌళి, రా మారావు, భారతి, సుజాత, ఏకే కుమారి, రాజయ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-11-22T00:10:28+05:30 IST