రాగిజావను పక్కాగా అందించండి

ABN , First Publish Date - 2023-03-26T00:13:37+05:30 IST

జగనన్న గోరుముద్దలో భాగంగా ఈనెల 21నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశపెట్టిన రాగిజావ పంపిణీ కార్యక్రమాన్ని పక్కాగా అమలు చేయాలని మండల ప్రత్యేకాధికారి ఎన్‌వీకే దుర్గాప్రసా ద్‌ అన్నారు.

రాగిజావను పక్కాగా అందించండి

బొండపల్లి: జగనన్న గోరుముద్దలో భాగంగా ఈనెల 21నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశపెట్టిన రాగిజావ పంపిణీ కార్యక్రమాన్ని పక్కాగా అమలు చేయాలని మండల ప్రత్యేకాధికారి ఎన్‌వీకే దుర్గాప్రసా ద్‌ అన్నారు. గరుడుబిల్లి గ్రామంలోని జడ్పీ ఉన్నత పాఠశాలను ఆయన శనివారం సందర్శించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు వారంలో మూడు రోజులపాటు మధ్యాహ్న పూట రాగి జావను ఇవ్వాలన్నారు. భోజనాల విషయంలో ఎక్కడా రాజీపడొద్దని, నాణ్యత లోపిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం గ్రామ సచివాలయాన్ని సందర్శించారు. ప్రతిఉద్యోగి జాబ్‌ చార్టుకు అనుగుణం గా పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ఎ.వేదవతి, పంచాయతీ కార్యదర్శి కె.ఎర్రినాయుడు, సర్పంచ్‌ బొద్దల కృష్ణవేణి పాల్గొన్నారు.

Updated Date - 2023-03-26T00:13:37+05:30 IST