Share News

సవరభాషా వలంటీర్ల జీతాలు చెల్లించాలి

ABN , First Publish Date - 2023-12-11T00:15:37+05:30 IST

పార్వతీపురం, సీతంపేట ఐటీడీఏ పరిధిలో పనిచేస్తున్న సవరభాషా వలంటీర్లకు బకాయిపడిన జీతాలు వెంటనే చెల్లించా లని యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు టి.రమేష్‌, ఎస్‌.మురళీ మోహన్‌రావు ఆదివారం ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు.ఆగస్టు నుంచి వీరు పనిచేస్తున్న 326మందికి జీతాలు అందలేదని పేర్కొన్నారు.మిగిలిన ఐటీడీఏల్లో జీతాలు చెల్లించినా ఈ ఐటీడీఏల్లో చెల్లించలేదని తెలిపారు.అకౌంట్‌ ప్రారంభం లో సమస్యలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారని, వెంటనే పరిష్కరించి రెండు రోజుల్లో జీతాలు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.

సవరభాషా వలంటీర్ల జీతాలు చెల్లించాలి

పార్వతీపురం ఆంధ్రజ్యోతి: పార్వతీపురం, సీతంపేట ఐటీడీఏ పరిధిలో పనిచేస్తున్న సవరభాషా వలంటీర్లకు బకాయిపడిన జీతాలు వెంటనే చెల్లించా లని యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు టి.రమేష్‌, ఎస్‌.మురళీ మోహన్‌రావు ఆదివారం ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు.ఆగస్టు నుంచి వీరు పనిచేస్తున్న 326మందికి జీతాలు అందలేదని పేర్కొన్నారు.మిగిలిన ఐటీడీఏల్లో జీతాలు చెల్లించినా ఈ ఐటీడీఏల్లో చెల్లించలేదని తెలిపారు.అకౌంట్‌ ప్రారంభం లో సమస్యలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారని, వెంటనే పరిష్కరించి రెండు రోజుల్లో జీతాలు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.

Updated Date - 2023-12-11T00:15:39+05:30 IST