18న జిల్లాకు పురందేశ్వరి రాక
ABN , First Publish Date - 2023-12-11T00:14:33+05:30 IST
జిల్లాకు ఈనెల 18న బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు డి.పురం దేశ్వరి రానున్నారని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు డి.శ్రీనివాసరావు తెలిపారు. ఆదివా రం పార్వతీపురంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో బీజేపీ పథకాలు, కార్యక్రమాల అమలు, పార్టీ అభివృద్ధి, పనితీరుపై పరిశీలిస్తారని చెప్పారు. అయో ధ్యలో రామ మందిర నిర్మాణానికి ఎన్నో వ్యయప్రయాసలు పడిన కరసేవకులకు ధన్యవాదాలు తెలిపారు. అటువంటి కరసేవకులు జిల్లాలో ఉంటే కార్యాలయా నికి వచ్చి తెలియజేయాలని కోరారు. ఈనెల 25న సుపరిపాలన దినాన్ని ప్రతి గ్రామంలో పండుగలా జరుపుకొనేలా నాయకులు, కార్యకర్తలు ప్రణాళిక లు సిద్ధం చేయాలన్నారు. కార్యక్రమంలో ఆ పార్టీ రాష్ట్ర నాయకులు ఎన్. జయరాజు, జిల్లా పార్టీ ఇన్చార్జి సూర్యప్రకాష్, జిల్లా నాయకులు తిరుపతిరావు, అప్పలనాయుడు, మురళి పాల్గొన్నారు.
పార్వతీపురంటౌన్: జిల్లాకు ఈనెల 18న బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు డి.పురం దేశ్వరి రానున్నారని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు డి.శ్రీనివాసరావు తెలిపారు. ఆదివా రం పార్వతీపురంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో బీజేపీ పథకాలు, కార్యక్రమాల అమలు, పార్టీ అభివృద్ధి, పనితీరుపై పరిశీలిస్తారని చెప్పారు. అయో ధ్యలో రామ మందిర నిర్మాణానికి ఎన్నో వ్యయప్రయాసలు పడిన కరసేవకులకు ధన్యవాదాలు తెలిపారు. అటువంటి కరసేవకులు జిల్లాలో ఉంటే కార్యాలయా నికి వచ్చి తెలియజేయాలని కోరారు. ఈనెల 25న సుపరిపాలన దినాన్ని ప్రతి గ్రామంలో పండుగలా జరుపుకొనేలా నాయకులు, కార్యకర్తలు ప్రణాళిక లు సిద్ధం చేయాలన్నారు. కార్యక్రమంలో ఆ పార్టీ రాష్ట్ర నాయకులు ఎన్. జయరాజు, జిల్లా పార్టీ ఇన్చార్జి సూర్యప్రకాష్, జిల్లా నాయకులు తిరుపతిరావు, అప్పలనాయుడు, మురళి పాల్గొన్నారు.