కొట్టాం-జామి బ్రిడ్జిపై నిరసన

ABN , First Publish Date - 2023-06-02T23:56:43+05:30 IST

కొట్టాం-జామి బ్రిడ్జిపై జామి గ్రామస్థులు, పలుగ్రామాల రైతులు జడ్పీటీసీ మాజీ సభ్యుడు బండారు పెదబాబు, జామి మాజీ సర్పంచ్‌ ఇప్పాక వెంకట త్రివేణి ఆధ్వర్యంలో గ్రీన్‌ఫీల్డ్‌ అధికారులు తీరుపై నిరసనకు దిగారు.

 కొట్టాం-జామి బ్రిడ్జిపై నిరసన
ధర్నా చేస్తున్న జామి గ్రామస్థులు, రైతులు:

జామి: కొట్టాం-జామి బ్రిడ్జిపై జామి గ్రామస్థులు, పలుగ్రామాల రైతులు జడ్పీటీసీ మాజీ సభ్యుడు బండారు పెదబాబు, జామి మాజీ సర్పంచ్‌ ఇప్పాక వెంకట త్రివేణి ఆధ్వర్యంలో గ్రీన్‌ఫీల్డ్‌ అధికారులు తీరుపై నిరసనకు దిగారు. ఇక్కడ ధర్నాతో గంటపాటు ట్రాఫిక్‌నిలిచిపోయింది. ఈసందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ పనులు ప్రారంభానికి ముందు గ్రీన్‌ఫీల్డ్‌ అధికారులు ఈ బ్రిడ్జికి అనుసంధానంగా సర్వీస్‌రోడ్డు వేస్తామని చెప్పారని, అలా చేయకుండా పెద్దలారీలు తిప్పి వంతెన మనుగడకు ప్రమాదం తెచ్చారని, నిత్యం వేలాదిమంది భయాందోళనతో తిరు గుతున్నారని వాపోయారు. రైతుల పొలాలకు వెళ్లే దారిలో కల్వర్టులు నిర్మించి దారు లు మూసేసి మరిన్ని ఇబ్బందులు సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. కలెక్టర్‌ దృష్టిసారించి సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఎటువంటి అవాంఛనీయ సంఘ టనలు జరగకుండా ఎస్‌.కోట సీఐ సింహాద్రినాయుడు ఆధ్వర్యంలో జామి,శృంగవ రపుకోట ఎస్‌ఐలు వీరబాబు, తారకేశ్వరరావు బందోబస్తు నిర్వహించారు.

Updated Date - 2023-06-02T23:56:47+05:30 IST