ఎంఈవో వైఖరిపై నిరసన
ABN , First Publish Date - 2023-03-31T00:10:36+05:30 IST
పార్వతీపురం ఎంఈవో పీవీ ప్రసాద్ ఉపాధ్యా యులపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, పక్షపాత దోరణి అవలంబిస్తున్నారని, ఆయనకు జ్ఞానోదయం కలిగించాలని కోరుతూ యూటీఎఫ్ నాయకుడు మురళీమో హన్రావు సీతారాములు విగ్రహానికి వినతిపత్రాన్ని అందజేశారు.
పార్వతీపురం, ఆంధ్రజ్యోతి: పార్వతీపురం ఎంఈవో పీవీ ప్రసాద్ ఉపాధ్యా యులపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, పక్షపాత దోరణి అవలంబిస్తున్నారని, ఆయనకు జ్ఞానోదయం కలిగించాలని కోరుతూ యూటీఎఫ్ నాయకుడు మురళీమో హన్రావు సీతారాములు విగ్రహానికి వినతిపత్రాన్ని అందజేశారు. ఈ మేరకు నిరసన తెలియజేసి పార్వతీపురంలో అగ్రహారం వీధిలోగల రామమందిరంలో సీతారాముల విగ్రహాలకు గురువారం వినతిపత్రం అందజేశారు. ఎంఈవో వైఖరిని మార్చాలని కోరారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ నాయకులు బి.జగన్నాథం, వసంతనాయుడు, ఎన్.శ్రీనివాసరావు, పి.వెంకటనాయుడు పాల్గొన్నారు.