ఆటో ఢీకొని వ్యక్తికి గాయాలు
ABN , First Publish Date - 2023-06-03T00:19:58+05:30 IST
ద్విచక్ర వాహనాన్ని ఆటో ఢీకొట్టిన ఘటనలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.
సీతంపేట: ద్విచక్ర వాహనాన్ని ఆటో ఢీకొట్టిన ఘటనలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానిక ఎస్ఐ నీలకంఠరావు శుక్రవారం తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రాణిపేట గ్రామానికి చెందిన అడపా షన్ముఖరావు అనే వ్యక్తి గురువారం విజయనగరం నుంచి తన స్వగ్రామానికి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా పులిపుట్టి సమీపంలో భారత ఇంటర్నేషనల్ స్కూల్ దగ్గర కొత్తూరు వైపు నుంచి సీతంపేట వైపు వస్తున్న ఆటో ఢీకొంది. దీంతో షన్ముఖరావుకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే సీతంపేట ఏరియా ఆసుపత్రికి తరలించి, ప్రథమ చికిత్స నిర్వహించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు.