చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
ABN , First Publish Date - 2023-03-26T00:10:49+05:30 IST
మద్యం అనుకుని గడ్డిమందు తాగిన ఓ వ్యక్తి చికిత్స పొం దుతూ శుక్రవారం మృతిచెందాడు.
రాజాం రూరల్: మద్యం అనుకుని గడ్డిమందు తాగిన ఓ వ్యక్తి చికిత్స పొం దుతూ శుక్రవారం మృతిచెందాడు. పోలీసుల కథనం మేరకు.. రాజాం మండలం లోని సోపేరు గ్రామానికి చెందిన మామిడి సూర్యారావు(53) మద్యానికి బానిస య్యాడు. ఈ నేపథ్యంలో ఈనెల 18న పశువుల శాలలో దాచిఉంచిన గడ్డి మందు ను పొరపాటున మద్యం అనుకుని తాగాడు. అస్వస్థతకు గురైన ఆయన్ని వెంట నే రాజాం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ ప్రథమచికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం శ్రీకాకుళంలోని రిమ్స్కు తరలించారు. అక్కడ చికిత్సపొందు తూ శుక్రవారం మృతిచెందాడు. భార్య మామిడి సుజాత శనివారం రాజాం పొలీ సులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ఎస్ఐ రవికిరణ్ కేసు నమోదు చేశారు.