ఈ-డివిజనల్ మేనేజర్ పోస్టులకు నోటిఫికేషన్
ABN , First Publish Date - 2023-03-26T00:22:18+05:30 IST
జిల్లాలో రెండు ఈ- డివిజనల్ మేనేజర్ పో స్టులను కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేయనున్నట్లు కలెక్టర్ సూర్యకుమారి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
కలెక్టరేట్: జిల్లాలో రెండు ఈ- డివిజనల్ మేనేజర్ పో స్టులను కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేయనున్నట్లు కలెక్టర్ సూర్యకుమారి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. బొబ్బి లి, చీపురుపల్లి రెవెన్యూ డివిజన్లలో ఒక్కో ఖాళీ ఉందన్నా రు. అభ్యర్థులు బీఎస్సీ కంప్యూటర్స్, ఐటీ, బీటెక్, బీఈ, సీఈసీ, లేదా ఐటీ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండి ఇంగ్లిషులో ప ట్టు, మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ కలిగి ఉండాలన్నారు. వ యస్సు జూలై 1, 2022 నాటికి 21-35 సంవత్సరాల మధ్య ఉండాలన్నారు. నెలకు రూ 22,500 వేతనం ఇస్తారని, కాం ట్రాక్టు కాలం ఒక ఏడాది ఉంటుందని తెలిపారు. దరఖా స్తుదారులకు రాత పరీక్ష నిర్వహిస్తామని దానిలో ఉత్తీర్ణు లైన వారికి జిల్లా కమిటీ ఇంటర్య్వూ నిర్వహించి, ఎంపిక చేస్తారని తెలిపారు. రెండేళ్ల పాటు ఐటీ రంగంలో అనుభ వం ఉన్నవారికి 5 శాతం వెయిటేజీ మార్కులను ఇస్తార న్నారు. అధికారులను ప్రభావితం చేయడానికి ప్రయ త్నించినా, నకిలీ ధ్రువపత్రాలను సమర్పించినా దరఖాస్తు లను తిరస్కరిస్తామన్నారు.