‘దేశానికి మోదీ ముప్పు’ పుస్తకావిష్కరణ

ABN , First Publish Date - 2023-03-31T00:02:35+05:30 IST

దేశానికి మోదీ ముప్పు అనే పుస్తకాన్ని సీపీఎం నాయ కులు గురువారం ఆవిష్కరించారు. స్థానిక సీఐటీయూ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆ పార్టీ నాయకుడు పి.శంకరరావు మాట్లాడుతూ చరిత్రలో విదేశీ దురాక్రమణదారులతో దేశానికి నిత్యం ప్రమాదం పొంచి ఉండేదని, ఇప్పుడు మోదీ రూపంలో పొంచి ఉందని దుయ్యబట్టారు.

‘దేశానికి మోదీ ముప్పు’ పుస్తకావిష్కరణ

బొబ్బిలి, మార్చి 30: దేశానికి మోదీ ముప్పు అనే పుస్తకాన్ని సీపీఎం నాయ కులు గురువారం ఆవిష్కరించారు. స్థానిక సీఐటీయూ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆ పార్టీ నాయకుడు పి.శంకరరావు మాట్లాడుతూ చరిత్రలో విదేశీ దురాక్రమణదారులతో దేశానికి నిత్యం ప్రమాదం పొంచి ఉండేదని, ఇప్పుడు మోదీ రూపంలో పొంచి ఉందని దుయ్యబట్టారు. సహజవనరులన్నిటినీ అదానీ తది తరులకు అప్పనంగా కట్టబెడుతున్నారన్నారు. రాష్ట్రంలో జగన్‌ సహకారంతో వనరుల దోపిడీ జరుగుతోందన్నారు. మోదీ, జగన్‌ ఇద్దరూ ఏకమై అదానీకి ప్రజాసంపదలను కట్టబెడుతున్నారని ఆరోపించారు. పేదలను మరింత పేదరికంలోకి నెడుతు న్నారన్నారు. అధి కారపక్షం అండదండ లతో ప్రపంచ కుబేరు లుగా ఎదిగిన వైనాన్ని ఆర్థికవేత్తలు ఈ పుస్త కంలో స్పష్టంగా వివ రించారన్నారు. ప్రజ లంతా అప్రమత్తం కాక పోతే ఇంకా పెనునష్టం తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గోపాలం, చిరంజీవి, గోపి, మణికుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-31T00:02:35+05:30 IST