వీఆర్వోల సమస్యల పరిష్కారానికి పోరాడుదాం
ABN , First Publish Date - 2023-11-20T00:12:21+05:30 IST
వీఆర్వోల సమస్యల పరిష్కారం కోసం పోరాడాల్సిన అవసరం ఉందని ఆ సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.మురళి అన్నారు.

పార్వతీపురంటౌన్: వీఆర్వోల సమస్యల పరిష్కారం కోసం పోరాడాల్సిన అవసరం ఉందని ఆ సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.మురళి అన్నారు. ఆదివారం పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలోగల తహసీల్దార్ కార్యాలయ ఆవరణలోగ ల వీఆర్వోల సంఘ భవనంలో ఆ సంఘ జిల్లా అధ్యక్షుడు ఎం.సింహాచలం ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈసందర ్భంగా ఆయన మాట్లాడుతూ గ్రేడ్-2 వీఆర్వోలను, గ్రేడ్-1లుగా పదోన్నతి కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం తాత్సారం చేస్తుందన్నారు. వీఆర్వోలపై పనిభారం తగ్గించాలని కోరారు.