కోటి చెరువును పరిరక్షించాలి

ABN , First Publish Date - 2023-06-02T23:53:21+05:30 IST

బొబ్బిలిలోని నాయకు డుకాలనీ పక్కనే ఉన్న కోటి చెరువు కబ్జా కోర ల్లో చిక్కుకొని పూర్తిగా కనుమరుగయ్యే ప్రమా దంలోఉందని, తక్షణమే పరిరక్షించాలని సీపీఐ నాయకుడు డిమాండ్‌ చేశారు. రెవెన్యూ, ఇరిగే షన్‌ అధికారులు అధికా రపార్టీ నాయకులకు ఊడిగం చేస్తూ ప్రభుత్వ స్థలాలు కబ్జా అవుతున్నా ఏమి తెలియనట్లు వ్యవహరించడం సిగ్గుచేటని ఆరోపిం చారు.

కోటి చెరువును పరిరక్షించాలి
చదును చేస్తున్న కోటి చెరువు ప్రాంతాన్ని పరిశీలిస్తున్న సీపీఐ నాయకులు

తెర్లాం (బొబ్బిలి): బొబ్బిలిలోని నాయకు డుకాలనీ పక్కనే ఉన్న కోటి చెరువు కబ్జా కోర ల్లో చిక్కుకొని పూర్తిగా కనుమరుగయ్యే ప్రమా దంలోఉందని, తక్షణమే పరిరక్షించాలని సీపీఐ నాయకుడు డిమాండ్‌ చేశారు. రెవెన్యూ, ఇరిగే షన్‌ అధికారులు అధికా రపార్టీ నాయకులకు ఊడిగం చేస్తూ ప్రభుత్వ స్థలాలు కబ్జా అవుతున్నా ఏమి తెలియనట్లు వ్యవహరించడం సిగ్గుచేటని ఆరోపిం చారు. ఈ మేరకు కబ్జాకు గురైన కోటి చెరువును శుక్రవారం సీపీఐ ఆధ్వర్యంలో నా యకులు పరిశీలించారు. ఈసందర్భంగా సీపీఐ జిలా ్లకార్యవర్గ సభ్యులు కోట అప్పన్న మాట్లాడుతూ కోటి చెరువులో కొంతమంది రాత్రికిరాత్రే మట్టి గ్రావెల్‌ వేసి జేసీబీతో చదును చేస్తున్నా అధికారులు నిద్రపోవడం వెనుక ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. తాను అధికారంలోకి వస్తే బొబ్బిలిలో భూకబ్జాలపై ఉక్కుపాదం మోపుతానని ప్రక టించిన ఎమ్మెల్యే శంబంగి వెంకట చినప్పల నాయుడు పట్టణంలో ఇంత స్థాయిలో ప్రభుత్వ స్థలాలు కబ్జాలకు గురవుతుంటే కనీసం పట్టించుకోకపోవడం సిగ్గుచేట న్నారు. రెవెన్యూ యంత్రాగం స్పందించి కోటి చెరువు హద్దులను సర్వేచేసి హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలని కోరారు. కార్యక్రమంలో సీపీఐ పట్టణ కార్యదర్శి మున కాల శ్రీనివాస్‌, సీపీఐ మండల నాయకులు వై.బాబ్జీ పాల్గొన్నారు.

Updated Date - 2023-06-02T23:53:21+05:30 IST