పోలింగ్‌ సామగ్రి పరిశీలన

ABN , First Publish Date - 2023-03-12T00:04:24+05:30 IST

ఈ నెల 13 న జరగనున్న ఉత్తరాంధ్ర పట్ట భద్రుల ఎమ్మె ల్సీ ఎన్నికల పోలింగ్‌ కోసం అవసరమైన సామగ్రిని ఆది వారం ఉద యం 8 గంటల కు స్థానిక తహసీల్దార్‌ సిబ్బందికి పంపిణీ చేయనున్నట్టు ఆర్డీవో పి.శేషశైలజ తెలిపారు.

పోలింగ్‌ సామగ్రి పరిశీలన
సిబ్బందికి అవగాహన కల్పిస్తున్న ఆర్డీవో శేషశైలజ

బొబ్బిలి: ఈ నెల 13 న జరగనున్న ఉత్తరాంధ్ర పట్ట భద్రుల ఎమ్మె ల్సీ ఎన్నికల పోలింగ్‌ కోసం అవసరమైన సామగ్రిని ఆది వారం ఉద యం 8 గంటల కు స్థానిక తహసీల్దార్‌ సిబ్బందికి పంపిణీ చేయనున్నట్టు ఆర్డీవో పి.శేషశైలజ తెలిపారు. పోలింగ్‌ నిర్వహణకోసం అవసరమైన సామగ్రిని శనివారం ఆమె పరిశీలించారు. అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ.. బొబ్బిలి రెవెన్యూ డివిజన్‌ పరిధిలో 13 పోలింగ్‌ పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. స్థానిక రాజాకళాశాలలో ఆరు కేంద్రాలు, గజపతినగరంలో రెండు, బాడంగి, రామభద్రపురం, తెర్లాం, దత్తి రాజేరు, గంట్యాడ, మెంటాడలో ఒక్కొక్కటి చొప్పున పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ప్రతీ కేంద్రానికి పీవో, ఏపీవో, ఇద్దరు ఓపీవోలు ఉంటారని ఆమె తెలిపారు. మూడు రూట్ల కోసం నాలుగు బస్సులను సిద్ధం చేసినట్టు తెలిపారు.

Updated Date - 2023-03-12T00:04:24+05:30 IST