ఎ(గు)ంత ప్రమాదం?

ABN , First Publish Date - 2023-06-01T00:19:20+05:30 IST

టెలికాం కేబుల్‌ వైర్లు వేసేందుకు రహదారులపై తవ్వుతున్న గుంతలు ప్రమాదకరంగా మారుతున్నాయి. గుంతలను పూడ్చకుండా వదిలేస్తుండడంతో వాహనచోదకులు ప్రమాదాలకు గురవుతున్నారు.

   ఎ(గు)ంత ప్రమాదం?

టెలికాం కేబుల్‌ వైర్లు వేసేందుకు రహదారులపై తవ్వుతున్న గుంతలు ప్రమాదకరంగా మారుతున్నాయి. గుంతలను పూడ్చకుండా వదిలేస్తుండడంతో వాహనచోదకులు ప్రమాదాలకు గురవుతున్నారు. ఓ టెలికాం సంస్థకు చెందిన కేబుల్‌ వైర్లు వేసేందుకు రెండు నెలలు కిందట కొత్తవలస-విజయనగరం రహదారిపై గుంతలను తవ్వారు. కొత్తవలస జిల్లా పరిషత్‌ హైస్కూల్‌ సమీపంలో ఈ గుంతలను పూడ్చకుండా నిర్లక్ష్యంగా వదిలేశారు. దీంతో బుధవారం విజయనగరం నుంచి విశాఖకు వెళ్తున్న ఓ ద్విచక్ర వాహనచోదకుడు గుంతను గమనించక పోవడంతో ప్రమాదానికి గురయ్యాడు. బైక్‌ ముందు భాగమంతా గుంతలో కూరుకుపోయి పూర్తిగా పాడైపోయింది. అతను స్వల్వ గాయాలతో బయటపడ్డాడు. ఇటువంటి గుంతలను తక్షణమే పూడ్చేలా అధికారులు చర్యలు తీసుకోవాలని వాహనదారులు, ప్రయాణికులు కోరుతున్నారు.

-కొత్తవలస

Updated Date - 2023-06-01T00:19:20+05:30 IST