గోరుముద్ద ఎలా ఉందంటే.. చెయ్యెత్తే వారేరీ..!?
ABN , First Publish Date - 2023-02-28T04:03:49+05:30 IST
జగనన్న గోరుముద్ద విషయంలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణకు చేదు అనుభవం ఎదురైంది.
మంత్రి బొత్సకు చేదు అనుభవం
విజయవాడ, ఫిబ్రవరి 27 (ఆంధ్రజ్యోతి): జగనన్న గోరుముద్ద విషయంలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణకు చేదు అనుభవం ఎదురైంది. విజయవాడ ఆంధ్ర లయోలా కళాశాలలో ఏర్పాటు చేసిన రాష్ట్రస్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శనను మంత్రి బొత్స సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాటా ్లడుతూ.. ‘‘గోరుముద్ద ఇష్టంగా ఉందా.. ఇబ్బందిగా ఉందా..! ఇష్టంగా ఉందనే వాళ్లు చేతులు పైకెత్తండి’’ అని విద్యార్థులను కోరారు. దీంతో విద్యార్థులు ఒక్కసారిగా ఆలోచనలో పడ్డారు. ఎత్తాలా వద్దా అన్నట్టు.. ఓ పావు వంతు మంది మాత్రమే చేతులు పైకెత్తి తమ అంగీకారాన్ని తెలిపారు. కొద్ది మందే అంగీకారం తెలపడంతో మంత్రికి ఏంచేయాలో తోచలేదు. ఏమిటీ ఇష్టం లేదా..!అంటూనే ప్రసంగాన్ని కొనసాగించారు.